తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ || (46)
రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా, ఒకనాడు, జనస్థానంలో నివసించే కామరూపిణి ఐనటువంటి శూర్పణఖ అనబడే రాక్షసి, రాముడుని మోహించి వచ్చ్చినప్పుడు, తన తమ్ముడైన లక్ష్మణుడితో ఆ రాక్షసి ముక్కు, చెవులూ కోయించేసాడు శ్రీ రాముడు. (46)
తతశ్శూర్పణఖావాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం || (47)
శూర్పణఖకు ఇలా జరగగానే, తన అన్నలైన ఖర దూషణుల దెగ్గరకు వెళ్ళి, తనకు జరిగిన అవమానం గురించి చెప్పగా, వారు వారి దెగ్గర ఉన్న పదునాలుగువేల మంది రాక్షసులను రాముడిపైకి యుద్ధానికి పంపెను. (47)
నిజఘాన రణే రామ: తేషాం చైవ పదానుగాన్ |
వనే తస్మిన్ని వసతా జనస్థాన నివాసినాం || (48)
మొదటి పదునాలుగువేలమంది రాక్షసులను సమ్హరించిన రాముడు, తరువాత్ వరుసలో వచ్చిన ఖర, దూషణులను, వారి రాక్షస సైన్యంతో సహా రాముడు సమ్హరించెను. (48)
రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ |
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ: క్రోధమూర్చిత: || (49)
రాముడు, జనస్థానములో ఉన్నంత కాలము, ఖర, దూషణులతో కలిపి మొత్తం పదునాలుగు వేల మంది రాక్షసులను సమ్హరించెను. తన జ్ఞాతులైన ఖర దూషణుల మరణ వార్త విన్న రావణాసురుడు క్రోధాగ్నితో రగిలిపోయాడు. (49)
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం |
వార్యమాణస్సుబహుశో మారీచేన స రావణ: || (50)
క్రోధము పూనిన రావణాసురుడు, తన జ్ఞాతుల మరణానికి కారణమైనటువంటి వారిపై పగ సాధించవలెనని, మారీచుడు అనే రాక్షసుని సహాయమునకు వెళ్ళగా, అతడు రాముడితో వైరము రావణుడికి మంచిది కాదు అని వారించెను. (50)