చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయ: || (31)
ఈ ప్రయాణంలో భరద్వాజుని ఈశ్రమము చేరుకుని, ఆయన ఆజ్ఞచే చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. ఆ పర్వతము మీద ఒక సుందరమైన కుటీరము లక్ష్మణుడు నిర్మించెను. అయోధ్యలో ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ కుటీరంలో కూడా అంతే ఆనందంగా రాముడు, సీతా, లక్ష్మణుడు ఆ ఆశ్రమం లో గడిపారు. (31)
దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్ నుఖం |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా || (32)
అమితోత్సాహంతో ఆ ముగ్గురు, ఆనందంగా ఆ కుటీరంలో గడుపుతున్నారు. ఐతే రాముడు అడవులకు వెడలిపోయాడని దశరథ మహారాజు పుత్రశోకంలో మునిగిపోయాడు. (32)
రాజా దశరథ: స్వర్గం జగామ విలపన్ సుతం |
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజై: || (33)
తన ప్రియ పుత్రుడైన రాముడు అడవులకు వెల్లిపోయాడని విలపించి దశరథ మహారాజు దు:ఖంతో శరీరాన్ని విడిచిపెట్టేశారు. తండ్రి గారు వెళ్ళిపొగానే, అన్నగారైన రాముడు కూడా లేనందున, రాజ్య భారమును వశిష్ఠాది మహర్షులు తమ్ముడైన భరతునకు అప్పగించారు. (33)
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల: |
స జగామ వనం వీరో రామపాదప్రసాదక: || (34)
భరతుడు, రాజ్యాన్ని పాలించడానికి తగిన సమర్ధత కలిగినవడైనప్పటికి, తన అగ్రజుడైన రాముడు లేని రాజ్యం తనకు అఖ్ఖరలేదు అని వశిశ్ఠాదులకు చెప్పి, అన్నగారైనటువంటి రాముడితో ఉండటానికి అడవులకు బయలుదేరాడు. (34)
గత్వా తు స మాహాత్మానం రామం సత్యపరాక్రమం |
అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత: || (35)
భరతుడు అడవులకు చేరుకుని, సత్యపరాక్రమవంతుడైన రాముడి పాదాలచెంత చేరి, ఇలా ప్రాధేయపడుతునాడు. (35)
No comments:
Post a Comment