ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచన: |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ || (41)
దండకారణ్యములో ప్రవేశించిన తరువాత, విరాధుడు అనే రాక్షసుడిని రామచంద్రమూర్తి సంహరించారు. అటుపిమ్మట, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై శరభంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శించెను. (41)
సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా |
అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం || (42)
సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి, అటు పిమ్మట అగస్త్య మహర్షి ఆశ్రమానికి, అగస్త్య మహర్షి తమ్ముడి ఆశ్రమానికి కూడా వారు వెళ్ళెను. అగస్త్య మహర్షి, ఇంద్రుడు ఇచ్చిన ధనుస్సును రాముడుకి ఇచ్చెను. (42)
ఖడ్గం చ పరమప్రీత: తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైస్సహ || (43)
ధనుస్సుతో పాటు ఒక ఖడ్గము, ధనుస్సు కొశం అక్షయ బాణ తూణీరాలను కూడ ఇచ్చెను. ఆ తూణీరములలో బాణములు ఎన్నటికీ తరగవు. ఇలా శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ సమీపములో రాముడు నివసిస్తూ ఉండగా, అడవులలో నివసిస్తున్నవానప్రస్థులు రాముని వద్దకు వచ్చెను. (43)
ఋషయో భ్యాగమమ్ సర్వే వధాయాసుర రక్షసాం |
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే || (44)
వానప్రస్థులు రాముడి వద్దకు చేరి, వనాల్లో తిరుగుతూ వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని కోరగా, ఏ ఏ వనాలు రాక్షసుల వల్ల బాధపడుతున్నయో ఆ ఆడవులలో ఉన్న రాక్షసులందరినీ సంహరించటానికి రాముడు అంగీకరించెను. (44)
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధస్సంయతి రక్షసాం |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్య వాసినాం || (45)
అలా అంగీకరించిన రాముడు, అడవులలో ఉండి తపస్సు చేసుకుంటున్న మహా మునులందరిని, ఎవరైతే అగ్ని వంటి తేజస్సు కలిగి ఉన్నారో, వారిని వారి తేజస్సుతో రాక్షసులను నిర్మూలించమని అడిగెను. (45)
No comments:
Post a Comment