త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ |
రామోపి పరమోదార: సుముఖస్సుమహాయశా: || (36)
సహజ దానగుణ శీలుడు, ఉదార స్వభావుడైన రాముడితో భరతుడు అడవులకు వచ్చి " రామా, ఈ రాజ్యానికి నువ్వొక్కడివే రాజువి. ఈ రాజ్యము దశరథ మాహారాజు గారి తరవాత నీకే చెందుతుంది" అని అన్నాడు. (36)
న చైఛ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబల: |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పున: పున: || (37)
ఎంత బతిమిలాడినా, తన తండ్రి గారికి ఇచిన మాట కోసం రాజ్యాన్ని వొద్దు అను భరతునితో రాముడు చెప్పాడు. ఐనా భరతుడు రాజ్యాన్ని పాలించను అని అనగా, రాముడు, తన పాదుకలను భరతునకు ఇచి, వాటిని తన
స్థానం లో ఉంచమని చెప్పెను. (37)
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ: |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ || (38)
సింహాసనం మీద పాదుకలను ఉంచి రామాజ్ఞగా రాజ్యాన్ని పాలించమని భరతునకు చెప్పెను. భరతుడు, తన కోరిక తీరనందుకు బాధపడి, రామ పాదుకలకు నమస్కరించి, వాటిని తన శిరస్సున ధరించి బయలుదేరెను. (38)
నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ: || (39)
భరతుడు, అడావులను వదిలి వెళ్ళి, అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామములోనే నివసిస్తూ, రామ పాదుకలను రాజుగారి స్థానంలో ఉంచి, రామాజ్ఞగా రాజ్యాన్ని పాలిస్తూ, రాముడు ఎప్పుడు అయోధ్యకు తిరిగి వస్తాడో అని ఎదురుచూస్తూ ఉన్నాడు. (39)
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ || (40)
చిత్రకూటంలో రాముడు ఉన్న సంగతి భరతుడి వలన రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలిస్తే అందరు తన ఆశ్రమానికి వచ్చేస్తారని గ్రహించి, వాళ్ళు రాకపోయినా భరతుడే మళ్ళీ రావొచ్చని, తన ఆశ్రమాన్ని మర్చుకోవాలను నిర్ణయించుకున్నాడు. (40)
రాఘవ మూర్తీ! సుకృతుఁడ!
ReplyDeleteరాఘవు సత్కావ్య భావ రమ్యంబుగ నా
రాఘవుడొనరింపించెను.
రాఘవు దివ్యాజ్ఞ యట్లు వ్రాయుఁడు, శుభమౌన్.
ఆశీస్సులతో
చింతా రామ కృష్ణా రావు.